కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలని సీఎం నిర్ణయం

హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తక్షణమే తప్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు గవర్నర్‌కు సిఫారసు పంపారు. తెలంగాణ ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడిగా ఉన్న జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి, ఆయన స్థానంలో గద్వాల్‌ విజయలక్ష్మిని నియమించారు. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నెరెళ్ల శారద, కుడా చైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ సభ్యురాలు జి. సుధారాణి నియామకాలకు సీఎం ఆమోదం తెలిపారు.